Breaking News

గ్యాస్ కొరతకు ఊరట… రాష్ట్రాలకు సరఫరా ప్రారంభం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో నెలకొన్న LPG గ్యాస్ కొరతకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన రెండు LPG నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాయి.‘శివాలిక్’ నౌక 46,500 మెట్రిక్ టన్నుల LPGతో ముంద్రా పోర్ట్ చేరుకోగా, ‘నందదేవి’ నౌక వదినార్ పోర్ట్ కు చేరుకుంది. ఈ రెండు నౌకల రాకతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత సమస్య త్వరలోనే తగ్గనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర షిప్పింగ్ శాఖ సమన్వయంతో ఈ నౌకలు సురక్షితంగా భారత్ చేరుకున్నాయి. అలాగే భారత, ఇరాన్ నౌకాదళాలు కూడా సహకరించినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ప్రస్తుతం ఈ నౌకలలోని LPGను ఇతర నౌకలకు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం రాష్ట్రాలకు వేగంగా సరఫరా చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలకు, ముఖ్యంగా తమిళనాడుకు త్వరితగతిన పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.అధికారుల ప్రకారం, నేరుగా ఈ నౌకల ద్వారా సరఫరా చేయడం వల్ల ఆలస్యం తగ్గి వినియోగదారులకు త్వరగా గ్యాస్ అందుబాటులోకి రానుంది.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *