Breaking News

ప్రసూతి సెలవులపై కీలక మార్పు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ప్రసూతి సెలవుల విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దత్తత తీసుకున్న చిన్నారి వయసును ఆధారంగా చేసుకుని ప్రసూతి సెలవులు పరిమితం చేయడం సరైంది కాదని స్పష్టం చేసింది.సామాజిక భద్రతపై కోడ్ 2020లోని సెక్షన్ 60(4) ప్రకారం, మూడు నెలల లోపు వయస్సు ఉన్న శిశువును దత్తత తీసుకున్న మహిళలకే ప్రసూతి సెలవులు ఇవ్వాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది.చిన్నారి వయసుతో సంబంధం లేకుండా, దత్తత తీసుకున్న సమయం నుంచి 12 వారాల పాటు ప్రసూతి సెలవులు పొందే హక్కు మహిళలకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దత్తత తల్లుల హక్కులకు మరింత రక్షణ లభించనుంది.

గ్యాస్ ధరల పెంపు ముందే హెచ్చరించా: రాహుల్ విమర్శలు

రాహుల్ వ్యాఖ్యల కేసులో ఊరట.. ఎఫ్ఐఆర్ ఆదేశాలపై హైకోర్టు తిరస్కరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *