బెల్లంపల్లి, మార్చి 17: (నేటి తెలుగు పత్రిక): కాసిపేట 1 ఇంక్లైన్ గనిని మంగళవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ సందర్శించారు. అండర్ గ్రౌండ్ లో పని స్థలాలను, యంత్రాల పనితీరును పరిశీలించారు. కాసిపేట గని అధికారులు, ఉద్యోగులు మరింతగా శ్రమించి వార్షిక లక్ష్యాన్ని చేరుకునేలా ప్రయత్నించాలని సూచించారు. ఉత్పత్తి, రక్షణ, సంక్షేమంపై అధికారులు, కార్మికులు దృష్టి పెట్టాలని కోరారు. జిఎం రాధాకృష్ణ వెంట కాజీపేట గని మేనేజర్ సతీష్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, సర్వేయర్ ప్రభాకర్ లు ఉన్నారు.
