నడిగూడెం, మార్చ్ 17(నేటి తెలుగు పత్రిక): గ్రామంలో వార్డులలో ఉన్న సమస్యలు గుర్తించి ,స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రామాపురం సర్పంచ్, నడిగూడెం మండల సర్పంచుల సమైక్య అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు, ఈ సందర్భంగా పలు తీర్మానాలను చేశారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి నామా నరసింహారావు, ఉప సర్పంచ్ మందుల నాగార్జున, వార్డ్ మెంబర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
