Breaking News

గ్రామపంచాయతీ కార్మికుల అరెస్టు అప్రజా స్వామీకం.

నడిగూడెం , మార్చ్ 17(నేటి తెలుగు పత్రిక): అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు నడిగూడెం మండల అధ్యక్షుడు షేక్ సుభాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాదులో జరిగే గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశానికి హాజరు కాకుండా గ్రామపంచాయతీ వర్కర్లను ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రజా పాలనా అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో ప్రజలకు కార్మికులకు స్వేచ్ఛ లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు హైదరాబాద్ వెళుతున్న సందర్భంలో అక్రమంగా అరెస్టు చేశారని ఈ అరెస్టులు సిఐటియుకి కొత్తేమీ కాదని ఎన్ని నిర్బంధాలు ఎదురైనా గ్రామపంచాయతీ కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని ఆయన అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు మద్దతుగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న, చెమట నాగరాజు. కంభంపాటి మధుసూదన్ గంటపొంగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *