Breaking News

అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. విజయవాడ లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన, అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి హామీ ఇచ్చారు.ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ముస్లింల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సీఎం చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశామని తెలిపారు.ఇక మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్‌ను పెంచినట్లు పేర్కొంటూ, ఈసారి రూ.6,090 కోట్లు కేటాయించామని వెల్లడించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పింఛన్లు, గ్యాస్ సబ్సిడీలు వంటి పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతోందని తెలిపారు.అన్ని మతాలను గౌరవిస్తూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *