Breaking News

అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ ఆవిష్కరణ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచానికి చాటేలా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు తో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. 125వ జయంతిని పురస్కరించుకుని “స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్” పేరుతో 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ ఎత్తును నిర్ణయించారు.

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పొట్టి శ్రీరాములు త్యాగానికి మానవరూపమని, ఆయన ప్రాణత్యాగమే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కారణమని అన్నారు. “నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా… ఆ గౌరవం మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములే” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.అమరావతిలో ఈ విగ్రహం ఏర్పాటు ద్వారా యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు.అదేవిధంగా అమరావతి ప్రాంతంలో స్మృతివనం, మ్యూజియం, ఫోటో గ్యాలరీ వంటి ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు – మంత్రి లోకేష్ హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *