బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక) : బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్కూరి రాంచందర్ ఆదేశాలతో బుధవారం మండలంలోని ఆకెనెపల్లి గ్రామంలో ముస్లిం లకు కాంగ్రెస్ నాయకులు రంజాన్ తోఫా ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకెనపల్లి గ్రామ ఉపసర్పంచ్ తోట రవి, వార్డు సభ్యులు మహేశ్వర్, వంజరి లింగమయ్య, వంజరి అశోక్, వేముల రాజేశం లు పాల్గొన్నారు.
