Breaking News

ఆలేరు గోలనుకొండలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం గొలనుకొండ గ్రామములో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలన్న గారికి రైతుల ఆనందం, పాలాభిషేకంతో కృతజ్ఞతలు.ఆలేరు మండలం గొలనుకొండ గ్రామానికి కాలువల ద్వారా నీటి విడుదలపై గ్రామ సర్పంచ్ ఇందూరి యాదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భీమగాని శ్రీనివాస్ ఆలేరు ఓబీసీ మండల అధ్యక్షులు బందరపు మధు గౌడ్ రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే శ్రీ బిర్లా ఐల్లయ్య గారు కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం చాలా గొప్ప విషయం. ఈ నిర్ణయం వల్ల సుమారు 200 నుండి 300 ఎకరాల వ్యవసాయ భూములకు నీరు చేరే అవకాశం ఉంది. ఎండలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరట చెరువులు, కుంటలు నిండే పరిస్థితి రావడంతో గ్రామ రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారి సేవలకు గుర్తింపుగా గ్రామ ప్రజలు “పాలాభిషేకం” నిర్వహించడం జరిగింది. ఇది వారి రైతుల పట్ల ఉన్న ప్రేమ, గౌరవానికి నిదర్శనం,” అని తెలిపారు.రైతుల పట్ల అంకితభావంతో పని చేస్తున్న నాయకుడిగా ఎమ్మెల్యే గారు నిలుస్తున్నారని కొనియాడారు.

మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *