మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది.పార్టీ ఎలాంటి కూటమిలోనూ చేరదని టీవీకే స్పష్టంచేసింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్ను కూడా టీవీకే తిరస్కరించినట్లు సమాచారం. 90 సీట్లు, అలాగే 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చినప్పటికీ, దాన్ని అంగీకరించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున్ మాట్లాడుతూ, “ఢిల్లీ ఎదుట విజయ్ తలవంచరు” అని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.విజయ్ పార్టీ ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
