Breaking News

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ప్రత్యేకంగా కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో గాలివానలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో క్యూములోనింబస్ మేఘాలు ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పంటలను రక్షించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

నూతన మాకాల గోపాలం సేవా సమితి ప్రారంభం…!

సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *