Breaking News

మోటకొండూరు చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా

గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్.

సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు మోటకొండూర్ మండల కేంద్రంలోని చెరువుని “గోదావరి జలాలతో ” నింపిన గౌరవనీయులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలన్న సహకారంతో చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా కట్టమైసమ్మకు మరియు గంగమ్మకు కొబ్బరికాయలు , పాసులు కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మరియు ఉప సర్పంచ్ వంగాల నికిత మహేందర్ గౌడ్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ కొమరయ్య , గ్రామంలోని సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ అడుగంటుతున్న భూగర్భ జలాల వల్ల రైతులు తీవ్రంగా నీటి ఎద్దడి ఎదుర్కొన్న సందర్భంలో చెరువును నింపి రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

కే.హెచ్.ఆర్ ఫౌండేషన్ చలివేంద్రంను ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *