గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్.
యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు మోటకొండూర్ మండల కేంద్రంలోని చెరువుని “గోదావరి జలాలతో ” నింపిన గౌరవనీయులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలన్న సహకారంతో చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా కట్టమైసమ్మకు మరియు గంగమ్మకు కొబ్బరికాయలు , పాసులు కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మరియు ఉప సర్పంచ్ వంగాల నికిత మహేందర్ గౌడ్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ కొమరయ్య , గ్రామంలోని సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ అడుగంటుతున్న భూగర్భ జలాల వల్ల రైతులు తీవ్రంగా నీటి ఎద్దడి ఎదుర్కొన్న సందర్భంలో చెరువును నింపి రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
