- మేరా యువ భారత్ – నల్గొండ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
- ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తాళ్లపల్లి మహేష్
యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు పట్టణంలోని ద్వారక నగర్ కాలనీలో భజరంగ్ యూత్ అసోసియేషన్ వారు మేరా యువ భారత్ నల్గొండ వారు నిర్వహించే యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని యువతకు ప్రభుత్వం తరఫున వచ్చే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. యువతను సన్మార్గంలో నడుపుతూ, సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ – నల్గొండ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్-ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తాళ్లపల్లి మహేష్ ,భజరంగ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సాయికుమార్, ఉపాధ్యక్షుడు ఎస్. వెంకట్ ,ప్రధాన కార్యదర్శి S.సందీప్ , ఏం. ప్రదీప్ , శివకుమార్, కిరణ్, రాజు,వివేక్,భాను ,సతీష్, నవీన్ వంశీ, నాగరాజు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
