Breaking News

అంబటి అనుదీప్ మరణం పై విచారణ జరపాలి

కుట్ర దారులను శిక్షించాలి.

న్యాయం జరిగేవరకు రాష్ట్ర కాపు జే ఏ సీ పోరాటం..చందు జనార్దన్ అధ్యక్షులు

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

చా ట్రాయ్-ఏలూరు-మార్చ్ 18 బుధవారం, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): అంబటి దివ్య అనుదీప్ మరణం వెనుక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేశారు.బుధవారం నూజివీడు నియోజకవర్గం లో చా ట్రాయ్ లో అనుదీప్ స్వగృహం లో వారి కుటుంబాన్ని పరామర్శించిన చందు జనార్ధన్ 200 పై పాల్గొన్న స్థానిక కాపు కుటుంబ సభ్యుల నుద్దేశించి మాట్లాడారుఅనుదీప్ తండ్రి అంబటి గోపాలరావు తన కుమారుడిని చంపు తామని ఇంటికి వచ్చి గతవారం క్రితం బెదిరించారని వారు బెదిరించి నట్లే హత్య చేశారని ఆవేదనతో చెప్పారు.దివంగత అనుదీప్ కుటుంబానికి మద్దతు తెలపడమే కాక మరణానికి కారకులను శిక్షించాలని పూర్తి స్థాయి విచారణ జరపాలని త్వరలో జిల్లా ఎస్ పి గారిని కలిసి విచారణ కోరనున్నట్లు, న్యాయం కోసం గౌరవ ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పెద్దల సమక్షం లో నిర్ణయం తీసుకోవడం జరిగింది, కమ్ముల కొండలరావు,బ శెట్టి ప్రసాద్,ప్రముఖ న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప, అంబటి సత్యనారాయణ,శ్రీరాములు సత్యనారాయణ, సవరం రామారావు,బండి శ్రీనివాసరెడ్డి,పసుపు లేటి వెంకటేశ్వర రావు,అంబటి చంద్ర శేఖర్,ఉజ్జి గిరి నరసింహారావు,పసుపు లేటి సత్యనారాయణ, కొల్లా శ్రీకాంత్,పసుపు లేటి రంగారావు, అంబటి రాంబాబు,మండా సమీర్,కంపసాటి మారేశ్వర రావు,నెల్లూరు మురళి, అంబటి శ్రీనివాసరావు,సదరు రాజేష్,గాజుల ప్రశాంత్,అనేక మంది నియోజకవర్గ మండల కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *