కోదాడ, మార్చి 19(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ,కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరం, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలా ప్రజల జీవితాలు సుఖదుఃఖాల సమతుల్యతతో ముందుకు సాగాలని, ప్రతి ఇంటిలో ఆనందం వెల్లివిరియాలని,ప్రతి కుటుంబంలో సిరిసంపదలు నిండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి నెలకొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
