మార్చి 19, నేటి తెలుగు పత్రిక: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కె. టి. రామారావు పాల్గొన్నారు. నూతన సంవత్సరానికి శుభారంభంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.ఈ వేడుకల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు హాజరై ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


