Breaking News

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కె. టి. రామారావు పాల్గొన్నారు. నూతన సంవత్సరానికి శుభారంభంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.ఈ వేడుకల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు హాజరై ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కరీంనగర్ ఆకాశవాణి కేంద్రం అభివృద్ధికి వినతి

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: చంద్రబాబు నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *