Breaking News

రేవంత్ రెడ్డికు ‘రైతు ఉత్సవాలు’ కార్యక్రమాలకు ఆహ్వానం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ మేరకు ఆహ్వానాన్ని అందించారు.

ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యాచరణలో భాగంగా ఈ నాలుగు రోజుల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులపాటు “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 22న జనగామ జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు. దానికి సమీపంలో రూ. 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి గారు స్థానిక రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడిన అనంతరం తొలివిడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *