Breaking News

ధురంధర్: ది రివెంజ్ లో ప్రధాని మోదీ సీన్స్ చర్చనీయాంశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) విడుదలైన తర్వాత థియేటర్లలో మంచి స్పందన పొందుతోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్, కథనం, సాంకేతిక విభాగం పనితీరు సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి ప్రధాని నరేంద్ర మోదీకు సంబంధించిన సన్నివేశాలు. నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) వంటి కీలక సంఘటనలను ప్రతిబింబించే సన్నివేశాలు సినిమాలో చూపించడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలను కూడా కథలో భాగంగా చూపించారు.అలాగే, మోదీ పాత్రను ఒక నటుడు పోషిస్తూ, మిషన్‌కు సంబంధించిన కీలక చర్చలు జరిపే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన రిఫరెన్స్‌లతో మోదీ పాత్రను చూపించడం ప్రేక్షకుల్లో చర్చకు దారితీసింది.మొత్తంగా, వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిన సన్నివేశాలు, ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘ధురంధర్ 2’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ మంచి ఆదరణ పొందుతోంది.

ఇరాన్ కొత్త వ్యూహం – చమురు, గ్యాస్ సరఫరాలపై దాడులు

రామరాజ్య సూత్రాలపై రాష్ట్రపతి సందేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *