మార్చి 19, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్పీజీ (LPG) కొరత పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే సుమారు 6 వేల ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, తెలంగాణలోనే దాదాపు 1000 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు పేర్కొంది. ప్రజలు ప్రత్యామ్నాయంగా PNG కనెక్షన్లను తీసుకోవాలని కేంద్రం సూచించింది. అదేవిధంగా అవసరమైతే కిరోసిన్, బొగ్గు పొయ్యిల వినియోగాన్ని కూడా పరిశీలించాలని తెలిపింది.ఇక రాష్ట్రాలకు తగినంత బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.ప్రస్తుతం గ్యాస్ సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్రం పలు అత్యవసర చర్యలు తీసుకుంటోంది.
