మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 24తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్పై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 1 నుంచి సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఈ తరగతులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి.అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. ఇంటర్ విద్యార్థులకు మే 31 వరకు సెలవులు ఉండగా, జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయి.ఇక 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని అమలు చేయనున్న విషయం తెలిసిందే. 2026-27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరం మొత్తం 232 పని దినాలు ఉండనున్నాయి.
