మార్చి 19, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం లో నిర్వహించిన శ్రీ రామ యంత్ర స్థాపన కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము, రామరాజ్య సూత్రాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నైతికత, సదాచారం, ధర్మం ఆధారంగా దేశ నిర్మాణం జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజంలో సమానత్వం, న్యాయం, శాంతి స్థాపనకు శ్రీరాముడి ఆలోచనలు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.శ్రీ రామ యంత్ర స్థాపనతో ఆలయానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత పెరిగిందని, దేశ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు, అధికారులు హాజరయ్యారు.


