మార్చి 19, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ తో జరుగుతున్న ఘర్షణలో నేరుగా సైనిక లక్ష్యాలపై దాడులు కాకుండా, ప్రపంచ చమురు–గ్యాస్ సరఫరాలపై ప్రభావం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రపంచానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా జరుగుతుండటంతో, ఈ మార్గాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఖతార్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ కేంద్రమైన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరం పై క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం.ఈ దాడిలో పలు క్షిపణులను అడ్డుకున్నప్పటికీ, ఒకటి నేరుగా గ్యాస్ ప్లాంట్ను తాకి గణనీయమైన నష్టం కలిగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ నిర్వహిస్తున్న పెర్ల్ GTL ప్లాంట్కు కూడా భారీ నష్టం వాటిల్లినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇంధన ధరల పెరుగుదల భారం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
