Breaking News

Sudden checks in AP wide fertilizer stores

ఏపీ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

ఏపీ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

అమరావతి:
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై విజిలెన్స్ శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 40 విజిలెన్స్ అధికారుల బృందాలు ఒకేసారి ఈ దాడులను నిర్వహించాయి.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

ఈ తనిఖీల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, లైసెన్సులు లేకుండా అమ్మకాలు జరపడం, తూకాల్లో లోపాలు వంటి అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఈ అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ స్పష్టం చేశారు.

రైతులపై ఎటువంటి భారాలు పడకుండా చూడటమే తమ ప్రాధాన్యమని డీజీ పేర్కొన్నారు. ఇలాంటి తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని, ఎలాంటి అక్రమాలను సహించబోమని విజిలెన్స్ శాఖ హెచ్చరించింది.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *