ఏపీ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
అమరావతి:
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై విజిలెన్స్ శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 40 విజిలెన్స్ అధికారుల బృందాలు ఒకేసారి ఈ దాడులను నిర్వహించాయి.
ఈ తనిఖీల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, లైసెన్సులు లేకుండా అమ్మకాలు జరపడం, తూకాల్లో లోపాలు వంటి అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఈ అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ స్పష్టం చేశారు.
రైతులపై ఎటువంటి భారాలు పడకుండా చూడటమే తమ ప్రాధాన్యమని డీజీ పేర్కొన్నారు. ఇలాంటి తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని, ఎలాంటి అక్రమాలను సహించబోమని విజిలెన్స్ శాఖ హెచ్చరించింది.
