హైదరాబాద్, మార్చి 19, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్పేట్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జూబ్లీ చెక్పోస్టు సమీపంలో ఒక మెట్రో ట్రైన్ నిలిచిపోవడంతో, అదే మార్గంలో రెండు వైపులా రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణం మధ్యలో నిలిచిపోయిన ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.సాంకేతిక లోపం కారణంగానే ఈ అంతరాయం ఏర్పడినట్లు మెట్రో అధికారులు ప్రాథమికంగా తెలిపారు. సమస్యను గుర్తించి పరిష్కరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.ఈ ఘటనతో ఉదయం పీక్ అవర్స్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు ఆలస్యానికి గురయ్యారు. మెట్రో సేవలు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
