Breaking News

కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్ – “ఇక టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ కాదు.. వన్ ఇండియన్ సినిమా”

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ వేడుకలో లోకనాయకుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “ఇక టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ అనే భేదాలు లేవు.. ఇప్పుడు అంతా ఒకటే.. వన్ ఇండియన్ సినిమా” అని ఆయన అన్నారు. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఒకటిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

కవిత కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు – త్వరలో కొత్త పార్టీ ప్రకటన

తనకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందని, చిన్న వయసులోనే ఇక్కడ పని చేసిన అనుభవం ఉందని కమల్ హాసన్ గుర్తుచేశారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని, ప్రజా కవి గద్దర్‌కు ఇది నిజమైన గౌరవమని అన్నారు.ఇక కాంతారావు అవార్డును అందుకున్న ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. గద్దర్ అవార్డులను తిరిగి ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డుల కోసం చాలా కాలంగా ఎదురుచూశామని, ఇప్పుడు గద్దర్ అవార్డుల రూపంలో వాటిని అందించడం ఆనందంగా ఉందన్నారు.మొత్తంగా ఈ వేడుక సినీ రంగానికి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, హైదరాబాద్‌ను భారతీయ సినిమా కేంద్రంగా మరింత బలపరిచే దిశగా సాగుతున్న చర్యలకు నిదర్శనంగా నిలిచింది.

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *