మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూడూరు గ్రామంలో ఐస్క్రీమ్ ఆటోలు, బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామస్థులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో వివిధ ప్రదేశాల్లో “ఐస్క్రీమ్ బండ్లకు ప్రవేశం లేదు” అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. పిల్లలు తరచూ ఐస్క్రీమ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.అంతేకాకుండా, ఈ నిషేధాన్ని ఉల్లంఘించి గ్రామంలోకి ఐస్క్రీమ్ బండ్లు తీసుకువస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించారు.ఈ వినూత్న చర్యపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు గ్రామస్థుల నిర్ణయాన్ని అభినందిస్తుండగా, మరికొందరు ఇది అతిగా ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గూడూరు గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
