బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా శుక్రవారం ఉడుత రజిత, రాజేష్ దంపతుల నూతన గృహాన్ని టిపిసిసి ఓ బి సి స్టేట్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న సంకల్పం లో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగన వేణి ఐలయ్య, గుండె వేణి నాగయ్య, మాచర్ల కొమురయ్య, మాచర్ల గంటయ్య, నాగన వేణి నరేష్, చిలుక మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
