Breaking News

బడ్జెట్ ప్రసంగంను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..చెవిలో పూలు పెట్టుకొని వాకౌట్!

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగాయి. ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.బడ్జెట్‌లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు. చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ “మోసం.. మోసం” అంటూ నినాదాలు చేశారు.ఉద్యోగాల కల్పన, మహిళలకు ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛన్లు, పీఆర్సీ వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వారు ఆరోపించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పింఛన్ వంటి హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.సభ నుంచి బయటకు వచ్చిన అనంతరం శాసనసభ ప్రవేశ ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. వారి ఆందోళనతో అసెంబ్లీ ప్రాంగణం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మొత్తానికి, బడ్జెట్‌పై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *