Breaking News

శాసనసభ, శాసనమండలి విప్‌లకు అభినందనలు తెలిపిన సీఎం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నర్సింగరావు అలాగే ఎమ్మెల్యేలు వేముల వీరేశం, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ రమణారావు ఈ సందర్భంగా సీఎంను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలియజేస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ విధానాలను శాసనసభ, శాసనమండలిలో సమర్థంగా అమలు చేయడంలో విప్‌ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ భేటీతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన విప్‌లు తమ పనిని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *