మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు రంజాన్ నెలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించినట్లు పేర్కొన్నారు. ఈ పవిత్ర నెల అనంతరం శనివారం జరుపుకుంటున్న ఈద్ అల్-ఫితర్ పండుగ ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.ప్రజలందరూ సుఖశాంతులతో, సోదరభావంతో జీవించాలని ఆకాంక్షిస్తూ, రంజాన్ పండుగ అందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకున్నారు.
