యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రానికి చెందిన ఇసియల్ సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ తండ్రి ,ఆలేరు ఎమ్మెల్యే పిఆర్వో ఆదిమూలం సురేష్ పెద్దనాన్న ,సీనియర్ నాయకులు, భాగవత కళాకారుడు ఆదిమూలం అంజయ్య గుండెపోటుతో మృతిచెందారు.ఈ సందర్భంగా తుర్కపల్లి మండలం కేంద్రంలో నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య మేర అంజయ్య నివాసానికి చేరుకుని, వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
