మార్చి 20, నేటి తెలుగు పత్రిక: సిద్ధిపేట జిల్లా రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యక్రమాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఈ నెల 25, 27 తేదీల్లో జరగనున్న నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు శ్రీ రామ నవమి వేడుకలకు హాజరుకావాలని కోరుతూ, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఆకుల రామ గౌడ్, పెండల గణేష్, బైరి నర్సింహా రెడ్డి, వాతం శివ, పడకండి విశ్వనాధం, ఎల్లప్పగారి పోచయ్య తదితరులు కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ వేడుకలు గ్రామస్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

