మార్చి 21, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తిరుమలలో తన సరళతను మరోసారి చాటుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నవారికి మహాద్వార దర్శనం అవకాశం ఉన్నప్పటికీ, దేవుని ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని ఆయన కట్టుబడి పాటిస్తున్నారు.అందుకే ఆయన ఎప్పుడైనా తిరుమల ఆలయం కు వెళ్లినప్పుడు సాధారణ భక్తుల మాదిరిగానే క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
అయితేబ్రహ్మోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మహాద్వార దర్శనం చేసుకుంటారు. మిగిలిన సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ దర్శనానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.దీనితో సీఎం చంద్రబాబు ఆచరణలో సమానత్వం, భక్తి భావం కలగలిపిన విధానాన్ని చూపిస్తూ భక్తుల్లో ప్రత్యేక గౌరవాన్ని సంపాదిస్తున్నారు.
