Breaking News

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా, పైలెట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశం కేసులో కీలకంగా మారింది.ఇక అభిషేక్ సింగ్ నుంచి మరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారన్న దానిపై SIT లోతుగా విచారణ చేపట్టింది. ముఖ్యంగా నిందితుడి సెల్‌ఫోన్ డేటాను విశ్లేషిస్తూ, నెట్‌వర్క్‌ను బయటపెట్టే దిశగా చర్యలు కొనసాగిస్తోంది.ఈ కేసులో మరిన్ని కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతోంది.

అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్‌తో ఆకతాయిలపై పోలీసుల చర్య

కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *