Breaking News

‘ధురంధర్ 2’పై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్. ఎస్. రాజమౌళి

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ చిత్రంపై ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 గంటల సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం అవసరమని పేర్కొన్నారు. చిత్రాన్ని చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా రూపొందించారని కొనియాడారు. ‘ధురంధర్ 1’*ను మించి ఈ సినిమా ఉందని, కథ, రచన, నటీనటుల ఎంపిక, సాంకేతికత, మ్యూజిక్, డిజైన్, డైరెక్షన్ అన్ని అంశాల్లోనూ ఎక్కడా లోపాలు కనిపించలేదని అన్నారు.ప్రత్యేకంగా కథలో ఉత్కంఠను సృష్టించే విధానం చాలా బాగుందని, దర్శకుడు ఆదిత్యధర్ అద్భుతమైన కృషి చేశారని ప్రశంసించారు. మొత్తంగా ‘ధురంధర్ 2’ సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా రూపొందించబడిందని అభిప్రాయపడ్డారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *