మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగి ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం కనిపిస్తోంది.శుక్రవారం పవర్ పెట్రోల్ ధర లీటర్కు రూ.2 పెరిగింది. అదే సమయంలో పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ.87.67 నుంచి రూ.109.59కి భారీగా పెరిగింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలోనే పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దేశంలో వరుసగా రెండో రోజు పెట్రోల్ ధరలు ఎగబాకాయి. రెండు రోజుల్లో సాధారణ పెట్రోల్పై లీటరుకు 40 పైసలకు పైగా పెరుగుదల నమోదైంది.
చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 17 పైసలు పెరిగి రూ.101.23కి చేరుకోగా, డీజిల్ 20 పైసలు పెరిగి రూ.92.81కి ఎగబాకింది.ఇతర నగరాల్లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ.87.67గా ఉండగా, కోల్కత్తా, ముంబైలో కూడా పెద్దగా మార్పులు లేవు.అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 112 డాలర్లకు చేరుకోగా, యూఎస్ క్రూడ్ కూడా 98 డాలర్లను దాటింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
