Breaking News

రోజా వ్యాఖ్యలపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.“అధికారం కోల్పోయినా ఇంకా మదం తగ్గలేదని, రోజా వ్యాఖ్యలే దానికి నిదర్శనం” అని ఆమె విమర్శించారు. ఓటమి తర్వాత మార్పు వస్తుందని భావించామని, కానీ ఇంకా అదే తీరులో వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.ప్రత్యేకంగా నారా కుటుంబం, ముఖ్యంగా భువనమ్మపై వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. “భువనమ్మపై మాట జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అంటూ హెచ్చరించారు.అదేవిధంగా వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే రోజా వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల దర్శనానికి వెళ్లడం, హిందూ సంప్రదాయాలను పాటించడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, వాటిపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.మొత్తంగా, రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, వ్యక్తిగత విమర్శలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సవిత రోజాకు సూచించారు.

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. వర్మ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *