Breaking News

Modi launched Visakha port projects virtually

విశాఖ పోర్టు  ప్రాజెక్టులను వర్చువల్​గా ప్రారంభించిన మోదీ

విశాఖ పోర్టు అథారిటీకి సంబంధించిన ప్రతిష్టాత్మక మైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీవర్చువల్​గా శ్రీకారం చుట్టారు.ముంబైలో కేంద్రం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారీటైం ఇండియా సమ్మిట్ 2023ను ప్రారంభించిన ప్రధాని.. దేశంలోని మేజ ర్ పోర్టులకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారం భించారు.విశాఖ పోర్టు పరిధిలో యాంత్రీకరణ పనుల ను పీపీపీ పద్దతిలో చేపట్టినట్టు అధికారులు వివరిం చారు. ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 7, 8, డబ్ల్యూక్యూ 6 మూడు బెర్త్​లను యాంత్రీకరించే పనిని విశాఖ పోర్టు చేపట్టింది. ఇందుకోసం పోర్టు 655 కోట్ల రూపాయలు కేటాయించిం ది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధిం చి ప్రధాని శంకుస్ధాపన చేశారు. విస్తరించిన విశాఖ కంటై నర్ టర్మినల్ ఫేజ్ 2 ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు డీబీఎఫ్ఓటీ విధానంలో సుమా రు 633 కోట్ల రూపా యలతో విస్తరించనున్నారు. కార్య క్రమానికి పోర్టు అధికారులు అనుబంధ సంస్థల ప్రతిని ధులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *