Breaking News

జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సుకు కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమానయాన రంగంపై పడుతోందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులు, ఇంధన ఖర్చులు ప్రభావితమవుతున్నాయని చెప్పారు.అలాగే విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేకే లైన్ (KK Line) అభివృద్ధి కోసం కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా, ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన భోగపురం విమానాశ్రయం ప్రాజెక్ట్‌పై ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ఎయిర్‌పోర్టును జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.మొత్తంగా, మౌలిక వసతుల అభివృద్ధి, రవాణా రంగ పురోగతితో రాష్ట్రానికి మరింత పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

పంట నష్టంపై రెండురోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *