Breaking News

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుదల

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 2:00 గంటల వరకు ₹500 అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో VIP మరియు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులు త్వరగా అమ్మవారిని దర్శించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే తిరిగి టికెట్ల జారీ ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని దేవస్థానం కోరింది.

ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. వర్మ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *