Breaking News

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుదల

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 2:00 గంటల వరకు ₹500 అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో VIP మరియు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులు త్వరగా అమ్మవారిని దర్శించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే తిరిగి టికెట్ల జారీ ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని దేవస్థానం కోరింది.

తిరువూరులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు!

పంట నష్టంపై రెండురోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *