మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్ నిధులను రేపు (మార్చి 22) విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తారు.రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం రెండు విడతల్లో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్ల నగదు జమ కానుంది.వాస్తవానికి ఈ నిధులు జనవరిలోనే విడుదల కావాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. అలాగే 20 రోజుల తర్వాత రెండో విడతగా రూ.2,650 కోట్లు, ఏప్రిల్ చివర్లో మూడో విడతగా సుమారు రూ.9,000 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.గతంలో అమలులో ఉన్న రైతు బంధు పథకాన్ని మరింత మెరుగుపరుస్తూ రైతు భరోసాగా మార్చిన ప్రభుత్వం, రైతులకు ఆర్థికంగా బలాన్నివ్వడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది.
