Breaking News

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్‌ విమర్శలు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.అలాగే ఈ పథకాల అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించలేదని విమర్శించారు. నిధుల మంజూరుకు ప్రభుత్వం పై మరింత ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.ప్రజలకు న్యాయం చేయాలంటే గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కరీంనగర్ లో ప్రపంచ కవితా దినోత్సవం!

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన… సర్పంచ్ శివరాత్రి లావణ్య జహంగీర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *