Breaking News

రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సూర్యాపేట మార్చి 20: (నేటి తెలుగు పత్రిక): ముస్లిం సోదర, సోదరీమణులకు ( కుటుంబ సభ్యులు) రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు భారీ నీటి పారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ శాంతి, సౌహార్ద్రం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా సామరస్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం మరింత బలపడాలని, అందరికీ ఆరోగ్యం, సంతోషం కలగాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.

సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ టూర్.. రూ.775 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *