Breaking News

ఆదివారం చికెన్ కష్టాలు.. గుడ్డుతో సరిపెడుతున్న సామాన్యులు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో ఆదివారం అంటే చికెన్ వాసనలతో కిటకిటలాడే మార్కెట్లు కనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీగా పెరిగిన ధరలతో చికెన్ షాపులు వెలవెలబోతుండగా, సామాన్యులు గుడ్లతోనే సరిపెట్టుకుంటున్నారు.రంజాన్ సీజన్‌తో పాటు పెళ్లిళ్ల కాలం, వేసవి ప్రభావం కలిసి రావడంతో చికెన్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో సప్లై తగ్గి ధరలు అమాంతం ఎగబాకాయి. వారం క్రితం రూ.330 వరకు లభించిన స్కిన్‌లెస్ చికెన్ ఇప్పుడు రూ.380 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి. నాటుకోడి ధరలు మరింత ఎక్కువగా ఉండి, కిలో రూ.800 వరకు చేరాయి. ఈ పరిస్థితుల్లో మటన్‌తో సమానంగా చికెన్ ధరలు పెరగడం విశేషం.

సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ టూర్.. రూ.775 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

వేసవి ఎండల కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల మరణాలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్ల పెంపకం తగ్గిపోవడంతో మార్కెట్లో సరఫరా తగ్గింది.ఇదే సమయంలో మటన్ ధరలు కూడా తగ్గడం లేదు. కిలో మటన్ ధర రూ.1000 వరకు చేరడంతో వినియోగదారులు చేపలు, రొయ్యలు వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.విజయవాడ లో అయితే చికెన్ ధరలు మరింత పెరిగి కిలో రూ.400కు పైగా అమ్ముతున్నారు. ఈ పరిస్థితి ఇంకా కొంతకాలం కొనసాగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *