నడిగూడెం ,మార్చ్ 22. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకానున్న సిద్దిపేట జిల్లా నేర్మెట్లో జరుగు రైతు మహోత్సవానికి, ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపనకు సూర్యాపేట జిల్లా, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి , ఆయిల్ ఫామ్ ఫీల్డ్ వర్కర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు , 50 మంది తరలి వెళ్తున్నారు. ఈ మహోత్సవ సందర్భంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపన చేయనున్నారని నడిగూడెం మండల వ్యవసాయ అధికారి మల్సూర్ తెలిపారు.
