Breaking News

సిద్దిపేటలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కేవలం 17 నెలల్లో పూర్తి కావడం విశేషం.రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంత్రులతో కలిసి సీఎం కర్మాగారాన్ని ప్రారంభించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు మరింత ఆదాయం, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలుపై రైతుల ధర్నా

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో వెలుగుచూసిన సంచలనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *