సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కేవలం 17 నెలల్లో పూర్తి కావడం విశేషం.రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంత్రులతో కలిసి సీఎం కర్మాగారాన్ని ప్రారంభించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు మరింత ఆదాయం, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.





