సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ స్టాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మొత్తం 150 స్టాళ్లలో ప్రదర్శించిన సాంకేతికత, వ్యవసాయ పరిజ్ఞానంపై సీఎం ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు.రాష్ట్ర వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభమైన రైతు మహోత్సవంలో సీఎం పాల్గొని రైతులు, కంపెనీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడారు. వివిధ పంటల సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతిక వినియోగం, ఉత్పత్తి పెంపుపై సూచనలు అడిగి తెలుసుకున్నారు.వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




