మార్చి 22, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఎయిర్పోర్టులో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు.రేపు అనకాపల్లి సమీపంలోని నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న భారీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్. డి. కుమారస్వామి హాజరుకానున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ప్లాంట్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు రానుందని భావిస్తున్నారు.
