Breaking News

బెల్లంపల్లిలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి నాయకులను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందుగానే అడ్డుకున్నారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు ధార కళ్యాణి, బెల్లంపల్లి మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి కనకం విజయ్, ఎర్రోజు శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, సోషల్ మీడియా కన్వీనర్ తోటపల్లి ఓం సాయి, నాయకులు దార రాజేష్, గోమాస రాజేష్, జస్వంత్ లను అడ్డుకొని బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

హైదరాబాద్‌లో తలసేమియా రన్.. జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి

ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ.. తెలంగాణ, ఓబీసీ అంశాలపై కీలక డిమాండ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *