Breaking News

మాంసం ప్రియులకు షాక్.. చికెన్ రేట్లు భగ్గుమంటున్నాయి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాంసాహార ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.340 వరకు చేరగా, వారం రోజుల క్రితం ఇదే ధర సుమారు రూ.260గా ఉండేది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో అవసరమైన వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు కూడా మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఇక మరోవైపు గుడ్డు ధరలు మాత్రం పడిపోతున్నాయి. గతంలో రూ.8 వరకు ఉన్న ఒక్క గుడ్డు ధర ప్రస్తుతం సుమారు రూ.4.20 వద్ద కొనసాగుతోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం వల్ల గుడ్ల ధరలు పడిపోయాయని పౌల్ట్రీ రంగం వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

చికెన్ ధరలు పెరగడానికి కారణాలు:

  • బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గడం
  • రంజాన్ వంటి వేడుకల వల్ల డిమాండ్ పెరగడం
  • చిన్న కోళ్ల సరఫరా కొరత
  • పౌల్ట్రీ ఫార్మ్‌లలో ఉత్పత్తి తగ్గుదల
  • డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం

మొత్తంగా, మార్కెట్‌లో డిమాండ్-సరఫరా అసమతుల్యతతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్ల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *